Pages

Showing posts with label Mythology. Show all posts
Showing posts with label Mythology. Show all posts

Guru Poornima - గురుపూర్ణిమ

శరణం... గురు చరణం...

శరణం... గురు చరణం...
గురు బ్రహ్మ

భారతీయ సంప్రదాయంలో గురువుది అత్యున్నతమైన స్థానం. గురువు అనుగ్రహం లేకుండా ఎవ్వరూ జీవిత లక్ష్యాలను సాధించలేరు. తల్లి, తండ్రి, గురువు, అతిథి- ఈ నలుగురు ప్రత్యక్ష గురువులు. భగవంతుని తల్లి, తండ్రి, గురువుల రూపంలోను, తల్లి, తండ్రి, గురువులను భగవంతుని రూపంలోను దర్శించి ఆరాధించడం భారతీయ సంప్రదాయం. సద్గురువును, సదాచార్యుని పొందడం గొప్ప అదృష్టం. యోగ్యత ఉన్న వ్యక్తుల చెంతకు భగవంతుడే ఒక సద్గురువును పంపిస్తాడట. సద్గురువును పొందడానికి యోగ్యత  కలగాలంటే సత్సంగంలోనూ, ఆధ్యాత్మిక కార్యకలాపాలలోనూ పాల్గొనడమే సరైన మార్గం. జగద్గురువు ఆదిశంకరులు, భగవద్రామానుజులు, షిరిడి సాయిబాబా వంటివారు కూడా సద్గురు చరణారవిందాలను సేవించినవారే! ఎందుకంటే...

నీటిలోని చేప తన చూపుతోను, తాబేలు తన స్పర్శతోను తమ పిల్లలని సాకినట్లుగా, శిష్యులను ఉత్తములుగా తీర్చిదిద్దగలిగిన మహనీయులే గురువులు. ప్రపంచంలో ఉన్న అనేక రకాల ఆధ్యాత్మిక సాధనలలో ఏది ఎవరికి తగినది? అన్నదానిని సాధకుని యోగ్యతను బట్టి, అవగాహన స్థాయిని బట్టి నిర్ణయించేది, ఉపదేశించేది గురువే. కనుక మన ధర్మంలో గురువుకు ప్రత్యేక స్థానం ఉండటం వల్ల గురువును దైవంగాను, ఒక్కోసారి దైవం కన్న మిన్నగాను పరిగణించే ఆచారం అనాదిగా వస్తోంది.

అపార జ్ఞానరాశిగా పోగు పడి ఉన్న వేదాలను నాలుగుగా విభజించి, అష్టాదశ పురాణాలను విరచించి, పంచమవేదం వంటి భారత మహేతిహాసాన్ని రచించిన  తేజోమూర్తి వేదవ్యాసుడు. వేదవాఙ్మయానికి మూల పురుషుడయిన వ్యాసుడు జన్మించిన ఆషాఢపూర్ణిమను వ్యాసపూర్ణిమగా జరుపుకుంటున్నాం. అపర నారాయణుడయిన ఈయన వల్లనే మన సంస్కృతి సంప్రదాయాలు ప్రపంచమంతటా పరిఢవిల్లాయి. బ్రహ్మసూత్రాలను నిర్మించి, కర్మ, జ్ఞాన, భక్తి మార్గాలను పటిష్టం చేసిన ఆ వశిష్ఠుని ముని మనుమడయిన వ్యాసుని ఈ రోజు అర్చించడం భారతీయుల కర్తవ్యం.

గురువులలో మొట్టమొదటి వాడు శ్రీకృష్ణుడు. అంతకన్నా ముందు దత్తాత్రేయులవారు. ఆ తర్వాత వేదవ్యాసుడు, ఆయన తర్వాత ఆదిశంకరాచార్యులు, షిరిడి సాయిబాబా, శ్రీ రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, భగవాన్ సత్యసాయి బాబా తదితరులు. వీరెవ్వరితోనూ మనకు ప్రత్యక్షమైన అనుబంధం ఉండచ్చు, ఉండకపోవచ్చు.

అయితే మనకు విద్యాబుద్ధులు నేర్పి, మనం గౌరవప్రదమైన స్థానంలో నిలబడేందుకు బాటలు పరిచిన మన గురువులతో మనకు అనుబంధం, సామీప్యం తప్పనిసరిగా ఉండి ఉంటుంది కాబట్టి గురుపూర్ణిమ  సందర్భంగా వారిని స్మరించుకోవటం, సేవించుకోవటం, సన్మానించుకోవటం సముచితం, సందర్భోచితం.

ఒకవేళ మనకు అందుకు వీలు లేనట్లయితే, కనీసం మన పిల్లలకైనా ఆ అవకాశం కల్పించటం, వారి చేత వారి గురువులకు పాదాభివందనం చేయించటం, సమ్మానింపజేయడం మన కనీస ధర్మం. 

Bhakta samskarta - BasavESwaruDu

భక్త సంస్కర్త - బసవేశ్వరుడు
Bhakta samskarta - BasavESwaruDu

భక్త సంస్కర్త... బసవేశ్వరుడు
సందర్భం- మే 2 బసవ జయంతి

పన్నెండో శతాబ్దంలో కర్ణాటక రాష్ట్రంలో అవతరించిన బసవేశ్వరుడు గొప్ప దార్శనికుడు. సంస్కర్త, కుల, వర్ణ, లింగ వివక్షలు లేని సమసమాజ స్థాపనకు ఆనాడే అపారమైన కృషి చేసిన సంస్కర్త. సనాతన సంప్రదాయ ఆచరణలో నెలకొన్న చాదస్తాలనూ, మౌఢ్యాలను నిర్మూలించేందుకు నడుం కట్టి, సర్వ మానవ సమానత్వాన్ని ప్రబోధించిన విశ్వ గురువుగా, క్రాంతి యోగిగా వీరశైవమతావలంబుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయిన మానవతావాది.

బసవేశ్వరుడు 1134 సంవత్సరంలో వైశాఖ శుద్ధ తదియ నాడు - అంటే నేటికి సరిగ్గా 880 సంవత్సరాల క్రితం -  అక్షయ తృతీయ శుభదినాన జన్మించాడు. ఆయన జన్మస్థలం కర్ణాటక రాష్ట్రంలో బీజాపూర్ జిల్లాలో హింగుళేశ్వర భాగవాటి (ఇంగలేశ్వర బాగేవాడి) అగ్రహారం. ఆయన తండ్రి మండెన మాదిరాజు అనే శైవ బ్రాహ్మణుడు. తల్లి మాతాంబిక. ఆయనను శివుడి ఆజ్ఞ వలన భూలోకంలో ధర్మస్థాపనకు అవతరించిన నందీశ్వరుడి అపరావతారంగా భావిస్తారు.

ప్రథమ ఆంధ్ర వీర శైవ కవిగా ప్రసిద్ధిగాంచిన పాల్కురికి సోమనాథుడు (1160-1240) తనకు దాదాపు సమకాలికుడైన బసవేశ్వరుడి జీవిత కథను ద్విపద ఛందస్సులో ‘బసవపురాణం’ పేరుతో కావ్యగౌరవానికి అర్హమైన భక్తి రస పురాణంగా రచించాడు. బసవేశ్వరుడికి శివభక్తి పసి వయసులోనే అబ్బింది. ఏడో యేట, గర్భాష్టమ సంవత్సరంలో తండ్రి తనకు ఉపనయనం సంకల్పించగా బసవడు వద్దని తండ్రితో వాదించాడు. ‘నిర్మల శివ భక్తి నిష్టితుడికి, కేవలం యజ్ఞాది వైదిక కర్మలతో కాలం పుచ్చే బ్రాహ్మణ్యంతో పనేమిటి? ఆ మార్గం నాకు అవసరం లేదు’ అని వైదిక కర్మాచరణల పట్ల మొదటి తిరుగుబాటు చేశాడు. ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు.

కృష్ణానదీ, మాలా ప్రభానదీ సంగమ క్షేత్రమైన కూడల సంగమేశ్వరంలో సంగమేశ్వరుడి సన్నిధికి చేరాడు. పన్నెండు సంవత్సరాలు అక్కడ అధ్యయనమూ, అధ్యాత్మిక సాధనలూ చేసి, సంగమేశ్వరుడి కటాక్షానికి పాత్రుడై ఆయనను ప్రత్యక్షం చేసుకున్నాడు.

పదవిలో ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా బసవేశ్వరుడు తన జీవితమంతా శివాచారనిరతితో గడిపాడు. ఆయనది వీరభక్తి మార్గం. ప్రస్థాన త్రయంలో భాగమైన బ్రహ్మసూత్రాలను శ్రీకర భాష్యం, నీలకంఠ భాష్యం రూపంలో వీరశైవ సిద్ధాంతాన్ని ప్రతిపాదించే వ్యాఖ్యానాలు ఎనిమిదో శతాబ్దినుంచే ఉండేవి. కానీ బసవేశ్వరుడు దాన్ని తన బోధనల ద్వారా, ఆచరణల ద్వారా, రచనల ద్వారా విశేష వ్యాప్తిలోకి తెచ్చాడు. కులంతో, జాతితో, లింగంతో, వర్ణంతో నిమిత్తం లేకుండా శివభక్తికి అందరూ అధికారులే. శివభక్తులందరూ సర్వసమానులే.

బసవేశ్వరుడి మతం భక్తి, శివభక్తి, ధర్మార్థ కామ మోక్షాలతో పాటు శివభక్తి పంచమ పురుషార్థం. తను బిజ్జలుడి ప్రధానిగా ఉన్న కాలంలో బసవేశ్వరుడు ‘అనుభవ మంటపం’ అనే ఆధ్యాత్మిక వాద సభా వేదికను ఏర్పరచి, తద్వారా వివిధ ఆధ్యాత్మిక సంప్రదాయాల వారు తమ తమ భిన్న అభిప్రాయాలను చర్చించుకునే అవకాశం కల్పించాడు. ఈ చర్చా వేదికలే తరవాత ఎన్నో శతాబ్దాలకు ప్రపంచదేశాలు ఎన్నింటిలోనో ఏర్పడిన ప్రజాస్వామిక వ్యవస్థలలో శాసన సభలకు నమూనాగా నిలిచాయనవచ్చు.

ఈ పద్ధతులూ, విశ్వాసాలూ, ముఖ్యంగా కుల వర్ణాతీతమైన భక్త్యాచారాల చేత బసవేశ్వరుడు బోధించటం, సనాతనులకూ ఛాందసులకు, విరోధి అయ్యాడు. ఒక బ్రాహ్మణ కన్యకు, దళిత యువకుడికీ తలపెట్టిన వివాహాన్ని బసవేశ్వరుడు ప్రోత్సహించటం వల్ల బసవేశ్వరుడికీ బిజ్జలుడికీ మధ్య తీవ్రమైన విరోధం కలిగింది. ఫలితంగా బసవేశ్వరుడు రాజధానిని వదిలిపెట్టి 1196లో తిరిగి కూడల సంగమేశ్వర క్షేత్రానికి వెళ్ళిపోయాడు. ఆ తరువాత బిజ్జలుడి హత్య జరిగింది. 1196 లోనే శ్రావణ శుద్ధ పంచమి నాడు, బసవేశ్వరుడు లింగైక్యం చెందాడు.

Facts about Pongal

Facts about Pongal


Æ¢Ÿ¿„çÕiÊ «á’¹Õ_-©Õ... ‚-¹-{Õd-Â¹×¯ä ¦ï«Õt© Âí©Õ-«Û©Õ... -’Ã-L-X¾-šÇ© éªX¾éªX¾-©Õ... ƒ-«-Fo ®¾¢“ÂâA ’¹Õª½Õh©ä! -«ÕJ ¨ X¾¢œ¿’¹åXj ‚®¾ÂËh-¹-ª½-„çÕiÊ ®¾¢’¹ÅŒÕ©Õ Åç©Õ-²Ä?
-X¾Û-ªÃ-ºÇ© “X¾ÂÃ-ª½¢...

-®¾¢“ÂâA X¾¢œ¿Õ’¹ „çÊÂé ¦ð©ãœ¿Õ ¹Ÿ±¿-©Õ-¯Ãoªá.
®¾¢“ÂâA Æ¢˜ä X¾¢{© X¾¢œ¿Õ’¹. X¾¢{©Õ X¾¢œË¢ÍŒ-œÄ-EÂË ‡Ÿ¿Õl©Õ ²Ä§ŒÕ-X¾-œ¿-Åêá. DE „çÊÂé ‹ ¹Ÿ±¿Õ¢C. ŠÂ¹²ÄJ P«Ûœ¿Õ ÅŒÊ „ã¾ÇÊ¢ Ê¢CÂË ‹ X¾E Íç¤Äpœ¿Õ. ¦µ¼Ö-©ð-ÂÃ-EÂË „çRx “X¾•-©Â¹× ‹ «Ö{ ÍçXÏp-ª½-«Õt-¯Ão-œ¿Õ. ªîW ÊÖ¯ç-Åî ²ÄoÊ¢ Í䮾Öh, ¯ç©Âî²ÄJ ¦µð•Ê¢ Í䧌֩E. ÂÃF Ê¢C A¹«Õ¹ X¾œË ªîW ¦µð¢Íä-§ŒÕ¢œË. ¯ç©Âî²ÄJ Åçj© ²ÄoÊ¢ Í䧌բœË. ÆE ÍçXÏp¢C{. P«Ûœ¿Õ ÂîX¾T¢* '“X¾•©Õ ªîW ¦µð•Ê¢ Í䧌֩¢˜ä ‡Â¹×ˆ« ‚£¾Éª½¢ X¾¢œË¢ÍÃL. «u«²Ä-§ŒÕ¢©ð ÊÕ«Ûy ²Ä§ŒÕ-X¾-œ¿ÕÑ ÆE -Ê¢-C-E -A-J-T ¦µ¼Ö-NÕ-åXjÂË X¾¢¤Äœ¿{.* Hµ†¾t XÏÅÃ-«Õ-£¾Ý-œËÂË ÂÕ-¹×-Êo-X¾Ûp-œ¿Õ ÍŒE¤ò§äÕ «ª½¢ …¢{Õ¢C. ‚§ŒÕÊ «Õ£¾É-¦µÇ-ª½ÅŒ §ŒáŸ¿l´¢©ð B“«¢’à ’çŒÕ-X¾-œË¯Ã …ÅŒh-ªÃ-§ŒÕ-º¢ «Íäa«ª½Â¹× ¦ÇºÇ-©-X¾-œ¿-¹-åXj X¾œ¿Õ¹×E „ä* …¢œË, ¨ ªîèä “¤ÄºÇ©Õ NœËÍÜ¿{.
* «Õ£¾É N†¾ßg«Û ‡¢Ÿ¿ªî ªÃ¹~®¾Õ©ÊÕ ®¾¢£¾ÇJ¢*, „Ã@Áx¢Ÿ¿JF B®¾ÕéÂRx -¨ ªî-V «Õ¢Ÿµ¿ª½ X¾ª½yÅŒ¢ ÂË¢Ÿ¿ åXšÇdœ¿-{, -Æ¢-Ÿ¿Õê Í眿ÕåXj «Õ¢* é’©Õ-X¾Û-Ê-Â¹× ®¾Ö*¹’à ®¾¢“ÂâAE Í䮾Õ-¹עšÇ-ª½Õ.
* ®¾Öª½Õuœ¿Õ «Õ¹ª½ ªÃP©ðÂË “X¾„äP¢Íä ¨ ªîV ÊÕ¢* …ÅŒh-ªÃ-§ŒÕ-º¢ „ç៿-©-«Û-ŌբC. Ÿ¿ÂË~-ºÇ-§ŒÕ-Ê¢©ð Ÿä«ÅŒ©Õ E“C¢*, …ÅŒh-ªÃ-§ŒÕ-º¢ ªÃ’Ã¯ä „äթšÇ-ª½E Æ¢šÇª½Õ. ®¾Öª½Õuœ¿Õ «Õ¹ª½ ªÃ¬ÇuCµX¾A ƪáÊ ÅŒÊ Â휿ÕÂ¹× ¬ÁE ƒ¢šËÂË ¨ ªîV «²Ähœ¿E X¾ÛªÃº ’ß±¿. …ÅŒh-ªÃ-§ŒÕ-º¢©ð ®¾Öª½u-Â˪½-ºÇ-©Õ ‚ªî’ÃuEÂË „äÕ©Õ Íä²Äh§ŒÕE Íç¦ÕÅê½Õ. 
* ¦µ¼U-ª½-Ÿ±¿Õ-œ¿Õ ÅŒX¾®¾Õq Íä®Ï ’¹¢’¹ÊÕ ¦µ¼Ö-NÕ-åXjÂË Åç*a¢C Â¹ØœÄ ®¾¢“ÂâA ªîèäÊ-{. Æ¢Ÿ¿Õê X¾Pa-«Õ¦ã¢’Ã-©ü©ð ’¹¢’Ã-²Ä’¹ªý «Ÿ¿l ¨ ªîV ©Â¹~-©Ç-C ¦µ¼Â¹×h©Õ X¾Ûºu-²Äo-¯Ã-©Õ ‚ÍŒJ-²Äh-ª½Õ. * ÂíEo „ä© \@Áx “ÂËÅŒ¢ ¯ä¤Ä©ü©ð ŠÂ¹ «Õ¢* «ª½h¹ל¿Õ ÊÕ«Ûy© „Ãu¤Äª½¢ Í䮾Öh ¦Ç’à ®¾¢¤Ä-C¢Íä-„Ã-œ¿Õ. ƪáÅä ‚§ŒÕÊ Åç*a åXšËdÊ ÊÕ«Ûy© ªÃP ‡¢ÅŒ ÆNÕt¯Ã ÅŒª½-’¹-œ¿¢©ä-Ÿ¿Õ. Â꽺¢ ƢŌզ{d¹ ‚§ŒÕÊ ‚ ¹×X¾p-©ðX¾© „çAÂËÅä ŠÂ¹ N†¾ßg«âJh “X¾A«Õ ŸíJÂË¢C. ŸÄEo 'A©ü «ÖŸµ¿„þÑ æXª½ÕÅî X¾Ü>¢ÍŒœ¿¢ „ç៿-©Õ-åX-šÇd-ª½Õ. ƒC •JT¢C ®¾¢“ÂâA ªîV¯äÊ{. ÆX¾pšË ÊÕ¢* ¨ X¾¢œ¿Âˈ ÊÕ«Ûy© NP†¾dÅŒ åXJT¢Ÿ¿¢šÇ-ª½Õ. ¯ä¤Ä©ü©ð '«ÖX¶ÔÕÑ æXª½ÕÅî •ª½Õ-X¾Û-Åê½Õ. 
’ÃLX¾šÇ© N¢ÅŒ-©Õ!

-®¾¢“ÂâA ÆÊ’ïä XÏ©x©Õ ’ÃLX¾šÇ©Õ ‡’¹êª®¾Öh «áJ®Ï-¤ò-ÅÃ-ª½Õ. «ÕJ «ÕÊ Ÿä¬Á¢©ð ’ÃLX¾š¢ «âu>§ŒÕ¢ …¢Ÿ¿E Åç©Õ²Ä?
* ’¹Õ•-ªÃ-Åý-©ðE Æ£¾Çt-ŸÄ-¦Ç-Ÿþ©ð …Êo ¨ éÂjšü «âu>-§ŒÕ¢©ð „ä©ÇC ª½Âé ’ÃLX¾šÇ©Õ ‚¹{Õd-¹עšÇªá. * ¦µÇÊÕ¦µÇ§ýÕ ³Ä Æ¯ä ‚§ŒÕÊ DEo 1985©ð “¤Äª½¢Gµ¢ÍÃ-œ¿Õ. ‚§ŒÕÊ 50 \@ÁÙx’à ¦µ¼“Ÿ¿-X¾-J-*Ê X¾ÅŒ¢’¹Õ©ä Âß¿Õ, Ÿä¬ÁŸä-¬Ç-©N, ‡¯îo ‚Âêéðx ƦÕs-ª½-X¾-J-ÍäN, \¹¢’à 22 Æœ¿Õ’¹Õ© -¦µÇ-K ’ÃLX¾šÇ©ÊÕ Â¹ØœÄ ƒÂ¹ˆœ¿ “X¾Ÿ¿-ª½z-Ê-Â¹× åXšÇdœ¿Õ.
* éÂjšü «âu>§ŒÖ©Õ “X¾X¾¢ÍŒ-„ÃuX¾h¢’à ƒ¢Âà …¯Ãoªá. šðÂîu, •ÂêÃh, ®Ï§çÖ©ü, ®Ï¢’¹-X¾Ü-ªý-©©ð …Êo OšË©ðx ¦ð©ãœ¿Õ ª½Âé ’ÃLX¾šÇ©Õ ‡¢Åî ‚Â¹{Õd-¹עšÇªá.
ƢŌ-ªÃb-B§ŒÕ ®¾¢Ÿ¿œË...

’¹Õ•-ªÃ-Åý-©ðE Æ£¾Çt-ŸÄ-¦Ç-Ÿþ©ð \šÇ ®¾¢“ÂâAÂË Æ¢ÅŒ-ªÃb-B§ŒÕ ’ÃLX¾šÇ© X¾¢œ¿Õ’¹ Åç’¹ ®¾¢Ÿ¿œË’à •ª½Õ-’¹Õ-ŌբC. DEo '…ÅŒh-ªÃ-§ŒÕ-ºýÑ ÆE XÏ©Õ-²Äh-ª½Õ.
* ƒ¢Ÿ¿Õ©ð ‡Têª ’ÃLX¾šÇ©Õ ͌֜ÄfEÂË éª¢œ¿Õ ¹@ÁÚx Íé«Û. åXj’à ƒÂ¹ˆœ¿ -O-šËÂî ª½ÖX¾¢{Ö …¢œ¿Ÿ¿Õ. •¢ÅŒÕ«Û©Õ, -Ÿä-«-ÅŒ-©Õ, ÂÃNÕÂú ¦ï«Õt©Õ, ƒ@ÁÙx ƒ©Ç ª½Â¹ª½Âé ‚Âêéðx Åç’¹ ƦÕs-ª½-X¾-ª½Õ-²Ähªá.* ¨ ’ÃLX¾šÇ© «ÕŸµ¿u ¤òšÌ Â¹ØœÄ …¢{Õ¢C. OšËE Í䧌՜ÄEÂË Ÿä¬ÁŸä¬Ç© ÊÕ¢* ¹-@Ç-ÂÃ-ª½Õ-©Õ «²Ähª½Õ.
* Æ£¾Çt-ŸÄ-¦Ç-Ÿþ©ð 'X¾ÅŒ¢’û ¦èǪýÑ æXJ{ “X¾Åäu¹ OŸµä …¢C.
* ’¹Õ•-ªÃ-Åý-©ðE ÍÃ©Ç Ê’¹ªÃ©ðx ’ÃLX¾šÇ© ¤òšÌ©Õ •ª½Õ-’¹Õ-Åêá.
* «á¢¦ªá©ð Â¹ØœÄ ’¹ÅŒ 25 \@Áx ÊÕ¢* ’ÃLX¾šÇ© X¾¢œ¿Õ’¹ \šÇ Eª½y-£ÏÇ-®¾Õh-¯Ãoª½Õ. ƒÂ¹ˆœËÂË Â¹ØœÄ ®¾Õ«Öª½Õ 40 Ÿä¬Ç© ÊÕ¢* 100 «Õ¢C ¹-@Ç-ÂÃ-ª½Õ-©Õ ’ÃLX¾šÇ©ÊÕ ÅŒ§ŒÖ-ª½Õ-Íä®Ï ‡’¹êª-§ŒÕ-œÄ-EÂË «²Ähª½Õ.* éÂjšü åX¶®Ïd«©ü «ÕÊ Ÿ¿’¹_êª Âß¿Õ, “X¾X¾¢ÍŒ-„ÃuX¾h¢’à 25Â¹× åXj’à Ÿä¬Ç©ðx \šÇ Åç’¹ ®¾¢Ÿ¿œË’à •ª½Õ-’¹Õ-ŌբC. 
“X¾X¾¢-ÍŒ¢-©ð¯ä ÆA åXŸ¿l ’ÃL-X¾-šÇEo ’¹ÅäœÄC Íçj¯Ã-©ðE šÇ¢’Ãb Ê’¹-ª½¢©ð ‡’¹-êª-¬Çª½Õ. ‚Âîd-X¾®ý ‚ÂÃ-ª½¢©ð …Êo DE ¦ª½Õ«Û 200 ê°©Õ.

gOdAdEvi - గోదాదేవి

gOdAdEvi - గోదాదేవి

                 సుధాభరితం... గోదాచరితం!


సుధాభరితం... గోదాచరితం! గోదాదేవి
తమిళంలో తిరు అంటే శ్రీయుతమైన, పవిత్రమైన అని, పావై అంటే వ్రతం అనీ అర్థం.  స్వామిని మనసారా కీర్తించి భోగిపండుగనాడు ఆ స్వామిలో ఐక్యమైన పావన చరితురాలు గోదాదేవి

సూర్యభగవానుడు ధనురాశిలో ప్రవేశించిన దగ్గర నుంచి భోగిపండుగ వరకు ఉండే మాసమే ధనుర్మాసం. వైష్ణవులు పరమ పావనంగా భావించే ఈ మాసంలో నిత్యమూ గోదాదేవి విరచిత ‘తిరుప్పావై’లోని పాశురాలను పారాయణ చేస్తారు. భూలోక వైకుంఠమై భాసించే తిరుమలలోనూ ధనుర్మాసమంతా సుప్రభాతానికి బదులుగా తిరుప్పావైని గానం చేయడం అనూచానంగా వస్తోంది. గోదాదేవి అంటే సాక్షాత్తూ శ్రీ మహాలక్ష్మి అవతారం. ఈమెనే వైష్ణవ సంప్రదాయంలో ఆండాళ్ అనీ, చూడికుడిత నాంచారి అనీ వ్యవహరిస్తారు.

శ్రీ వైష్ణవ సంప్రదాయంలో, భక్తి ప్రబంధాలలో పన్నిద్దరు ఆళ్వారులు సుప్రసిద్ధులు. వీరిలో పెరియాళ్వారుగా పిలువబడే విష్ణుచిత్తుడు తన ఉదాత్త చరితంతో విష్ణుభక్తుల్లో శాశ్వత స్థానం పొందాడు. విష్ణుచిత్తుడు స్థానిక వైష్ణవ దేవాలయాల్లో స్వామికి పుష్పాలను, తులసిమాలలను కైంకర్యం చేస్తూ, శ్రీకృష్ణుని సేవిస్తూ ఉండేవాడు. ఒకనాడు విష్ణుచిత్తుడికి తులసి మొక్కల మధ్య పవళించి బంగారు వర్ణంలో ఉన్న శిశువు కనిపించింది. భూమాత ప్రసాదించింది కాబట్టి ఆమెను గోదా నామంతో పిలుచుకుంటూ గారాబంగా పెంచాడు విష్ణుచిత్తుడు. ఈ గోదాకు అసలు నామం కోదై అని పండితుల ఉవాచ. కోదై అంటే సుమమాలిక అని అర్థం. గోదాదేవిని శ్రీకృష్ణుని పాదాల చెంతనే ఉంచి ఆమెలో భక్తిభావాలను చిన్ననాటి నుంచే చిగురింపజేశాడు. గోదాదేవి శ్రీవారికి సమర్పించే పూమాలలను కడుతుండేది. ఆ మాలలను భగవంతుడికి వినమ్రంగా సమర్పించేవాడు విష్ణుచిత్తుడు. గోదాదేవికి స్వామి మనోహరత్వాన్ని దర్శించాలనే కోరిక కలిగింది.

ఒకనాడు దేవాలయంలో జగన్మోహనాకారుడైన స్వామిని చూసి తన్మయురాలయింది. ఆ తరువాత స్వామివారికి సమర్పించే దండలను తాను ధరించి, తమ ఇంటిలో ఉన్న నూతిలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ మురిసిపోయింది. రానురానూ... తనకు, భగవంతునికి భేదం లేదని తలచి తన ఆత్మలోనే ఆ సర్వేశ్వరుణ్ణి త్రికరణశుద్ధిగా దర్శించింది.

ఒకనాడు విష్ణుచిత్తుడు స్వామికి సమర్పించే దండల్లో ఒక కేశపాశాన్ని చూసి గోదాదేవిని సందేహించి, తన అనుమానం నిజమేనని రూఢి చేసుకుని, ఒకరోజు గోదాదేవిని మందలించాడు. ఎప్పుడూ పల్లెత్తు మాట అనని తన గారాలపట్టిని నిందించినందుకు వ్యాకులచిత్తుడై, గోదా ధరించిన మాలలను స్వామికి సమర్పించడం అపచారంగా భావించాడు. ఆనాడు ఆలయానికి వెళ్లకుండా, తన గృహంలోనే తీవ్ర ఆవేదనతో శయనించాడు విష్ణుచిత్తుడు. ఆయనకు శ్రీకృష్ణుడు ప్రత్యక్షమై, ‘‘విష్ణుచిత్తా! నీవు నాకు నిత్యం భక్తితో సమర్పించే మాలలను ఈ రోజు సమర్పించలేదేం?’’ అని ప్రశ్నించగానే, విష్ణుచిత్తుడు జరిగినదంతా స్వామికి విన్నవించాడు. దానికి పరమాత్మ చిరునవ్వుతో... ‘గోదా ధరించిన మాలలను అలంకరించుకోవడం నాకు అత్యంత ప్రీతిపాత్రం’ అనగానే విష్ణుచిత్తుడు పరమానంద భరితుడయ్యాడు. ఆరోజునుంచి శ్రీహరి సేవలో నిమగ్నమయ్యారు తండ్రీకూతుళ్లు.

 గోదాకు యుక్తవయస్సు రావడంతో ఆమెకు వివాహం చెయ్యాలన్న తన నిర్ణయాన్ని ప్రస్తావించాడు విష్ణుచిత్తుడు. శ్రీకృష్ణుని తప్ప పరపురుషుని తాను వరించనని గోదాదేవి తండ్రికి స్పష్టం చేసింది. కాత్యాయనీవ్రతాన్ని భక్తిశ్రద్ధలతో, దీక్షతో ఆచరించిన గోపికలు ద్వాపరయుగంలో తమ మధురభక్తితో కమలాక్షుడైన శ్రీకృష్ణుని పొందారని తెలుసుకున్న గోదాదేవి తానూ ఆ స్వామి దేవేరిని కాగలనని విశ్వసించి, దృఢసంకల్పంతో కఠినమైన తిరుప్పావై దీక్షను ప్రారంభించింది.

 తమిళంలో తిరు అంటే శ్రీయుతమైన, పవిత్రమైన అని, పావై అంటే వ్రతం అని అర్థం. తాను విరచించిన తిరుప్పావైలోని భావబంధురమైన 30 పాశురాలతో మధురభక్తినీ, హృదయ సమర్పణం చేసే అలౌకిక ప్రణ యాన్నీ రంగరించి, మనసారా కీర్తించి భోగిపండుగనాడు ఆయనలోనే ఐక్యమైన పావన చరితురాలు గోదాదేవి. పాశుర గీతికలతో స్వామిని కీర్తించి, ఆ పరంధామునికి ఆత్మనివేదన చేసిన కారణజన్మురాలు గోదాదేవి. 

5 Weaks Vratham

                 సన్మార్గం: ఐశ్వర్యాన్నిచ్చే ఐదువారాల అద్భుత వ్రతం



సన్మార్గం:  ఐశ్వర్యాన్నిచ్చే ఐదువారాల అద్భుత వ్రతం
 హేమంతం వచ్చిందంటే చాలు కోటి శుభాల మార్గశీర్షం వచ్చేసినట్టే. లక్ష్మీకళతో లోగిళ్లన్నీ కళకళలాడినట్టే. ఎటు విన్నా ‘లక్ష్మీ నమస్తుభ్యం...’ ఎటు చూసినా ‘నమస్తేస్తు మహామాయే...’ అంటూ ఆ అమ్మను ఆర్తితో స్తుతించడం, పూజించడం వీనుల విందుగా వినిపిస్తూ, నయనారవిందంచేస్తుంటుంది. శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన ఈ మాసం ఆయన సతీమణి మహాలక్ష్మికీ మక్కువైనదే! నిన్న అంటే డిసెంబర్ 3, మంగళవారంతో మొదలైన మార్గశిరమాసం జనవరి 1, బుధవారంతో ముగియనుంది. ఈ మాసంలో వచ్చే మొదటి గురువారం నుంచి ఐదు వారాలపాటు తనను నియమనిష్ఠలతో కొలిచినవారికి కోరిన వరాలను ప్రసాదిస్తుంది కనకమహాలక్ష్మి. మార్గశిరమాసంలో మహాలక్ష్మిని ఎవరైతే మనస్ఫూర్తిగా ధ్యానిస్తారో, పూజిస్తారో సంవత్సరంలోని మిగిలిన పదకొండు మాసాల్లోనూ వారికి అష్టలక్ష్మీవైభవం సమకూరుతుంది. వారి మార్గం విజయపథమై విరాజిల్లుతుంది. ఆ వ్రతవిధానం అందరి కోసం...

 లక్ష్మీదేవి కరుణాకటాక్షాలు పొందాలనుకునేవారంతా మార్గశిరంలో ప్రత్యేక పూజలు చేస్తూ అమ్మవారికి దగ్గరవుతుంటారు. ఈ మాసంలో ప్రధానంగా చెప్పుకోదగింది లక్ష్మీవార వ్రతమే. దీన్నే కొందరు గురువార లక్ష్మీపూజ అని, లక్ష్మీదేవి నోము అని పిలుస్తారు. మార్గశిర లక్ష్మీవార వ్రతం, ఈప్సితాలను ఈడేర్చుకునేందుకు మహిళలకు, లోకానికి దక్కిన మహోత్కృష్టమైన వరం.
 ఐదువారాల అద్భుత వ్రతం...
 మార్గశిర లక్ష్మీపూజ ఐదు గురువారాలు చేయాల్సిన ఐశ్వర్య వ్రతం. ఈ నెలలో గనుక నాలుగే లక్ష్మీవారాలు వస్తే, ఐదవ వారంగా పుష్యమాసం తొలి గురువారం నాడు కూడా నోము నోచుకోవాలి.

 వ్రతవిధానం: ముందుగా ప్రాతఃకాలాన నిద్రలేచి తలారా స్నానం చేసి ఇంటి ముంగిట రంగవల్లులు తీర్చిదిద్దాలి. లక్ష్మీదేవి ప్రతిమను పూజా మందిరంలో ప్రతిష్ఠించుకోవాలి. దేవి కొలువున్న ప్రదేశాన్ని పూలతో, బియ్యప్పిండితో వేసిన ముగ్గుతో అలంకరించాలి. మహాగణపతి పూజతో వ్రతం మొదలవుతుంది. విఘ్నేశ్వరార్చన అనంతరం మహాలక్ష్మికి షోడశోపచార పూజ నిష్ఠగా నిర్వహించాలి. ‘హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజత స్రజాం’ అంటూ ప్రార్థన చేసి అమ్మవారిని ఆవాహన చేసుకోవాలి. ఆసనం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనీయం, శుద్ధోదక స్నానం, వస్త్రం, చామరం, చందనం, ఆభరణం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలాదులు, కర్పూరనీరాజనాన్ని యథావిధిగా సమర్పించాలి. ‘ఓం మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్’ అంటూ లక్ష్మీగాయత్రి పఠిస్తూ అమ్మవారికి మంత్రపుష్పాన్ని సమర్పించాలి.

  అనంతరం ‘సహస్రదళ పద్మస్థాం పద్మనాభ ప్రియాం సతీం’ అనే సిద్ధలక్ష్మీ కవచాన్ని సభక్తికంగా చదువుకోవాలి. తరువాత అష్టోత్తర నామావళి పూజ చేసి, మహానైవేద్యం సమర్పించాలి. నైవేద్యానంతరం లక్ష్మీవారవ్రత కథ చెప్పుకుని అక్షతలు శిరసున ధరించాలి.  చివరగా క్షమాప్రార్థన చేయాలి.
 అమ్మవారికి సమర్పించే మహానైవేద్యం విషయంలో కొన్ని నియమాలు పాటించాలని పెద్దలు చెబుతారు. తొలి గురువారం అమ్మవారు పుట్టినవారంగా ప్రఖ్యాతమైంది. కాబట్టి ఈ రోజు నోము సందర్భంగా పులగం నివేదన చేయాలి. రెండవవారం  క్షీరాన్నం (పరమాన్నం), మూడోవారం అట్లు, తిమ్మనం, నాలుగోవారం గారెలు, అప్పాలు నైవేద్యం పెట్టాలి. ఐదోవారం నాడు అమ్మవారికి  పూర్ణం బూరెలను నివేదించాలి. ఆ రోజు ఐదుగురు ముత్తయిదువులను ఆహ్వానించి వారికి స్వయంగా వండి వడ్డించాలి. అనంతరం దక్షిణ తాంబూలాదులిచ్చి వారి ఆశీస్సులు పొందాలి. దీంతో మార్గశిర లక్ష్మీవ్రతం పూర్తయినట్టే. మంగళగౌరీవ్రతంలాగ పూజపూర్తయ్యాక ఉద్యాపన చెప్పే క్రియ ఈ నోములో ఉండదు. ఎందుకంటే మన ఇంట్లోసౌభాగ్యలక్ష్మి నిత్యం విలసిల్లేందుకే ఈ పద్ధతిని పాటించాలనేది పండితుల ఉవాచ.

 నియమనిష్ఠలు కీలకం
 గురువార వ్రతం అత్యంత భక్తిశ్రద్ధలతో నియమంగా ఆచరించాల్సిన గొప్ప నోము. కాబట్టి ఈ నోము నోచేస్త్రీలు ఆయా లక్ష్మీవారాల్లో శుచిగా ఉండాలి. తలకు నూనె రాయడం, జుట్టు దువ్వుకోవడం, చిక్కులు తీసుకోవడం నిషిద్ధం. తొలిసంధ్య, మలిసంధ్య నిదురపోకూడదు. కల్లలాడకూడదు. నియమనిష్ఠలతో, భక్తిశ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించిన వారి ఇంట లేమి అనే శబ్దం పొడసూపదు. ఐశ్వర్యదేవత వరాలు కురిపించి విజయాలను చేకూరుస్తుంది.

 ఒక్క గురువారాలలోనే కాకుండా ఈ మాసంలోని ప్రతిరోజూ లక్ష్మిని పూజిస్తే విష్ణుసతి దీవెనలతో పదికాలాలు పచ్చగా వర్ధిల్లవచ్చని పురాణాలు చెబుతున్నాయి. అమ్మవారికి పూలు, పండ్లు, సువాసనలిచ్చే అగరుధూపం, పరిమళద్రవ్యాలు ప్రీతికరం. వీటితో ఆమె అనుగ్రహాన్ని అవలీలగా పొందవచ్చు. ఈ సువాసనలతో మన ఇంటిని లక్ష్మీప్రసన్నంగా మార్చుకోవచ్చు.

subhrahmaNyESwarudu - సుబ్రహ్మణ్యేశ్వరుడు

subhrahmaNyESwaruDu - సుబ్రహ్మణ్యేశ్వరుడు

శక్తిహస్తం విరూపాక్షం శిఖివాహనం షడాననం... దారుణం రిపు రోగఘ్నం భావయే కుక్కుటధ్వజం స్కంధం షణ్ముఖం దేవం శివతేజం ద్విషడ్భుజం... కుమారం స్వామినాథం తం కార్తికేయం నమామ్యహం

 పార్వతీపరమేశ్వరుల పుత్రుడైన కుమారస్వామి కారణజన్ముడు. తారకాసురుడనే లోకకంటకుడైన రాక్షసుని సంహరించడం కోసం జన్మించినవాడు. తనను భక్తితో కొలిచిన వారికి  నాయకత్వ సిద్ధి, విజయప్రాప్తి, వ్యాధినివారణ, సంతానలాభం, భూప్రాప్తి శీఘ్రంగా సిద్ధింపజేస్తాడు. మార్గశిర శుద్ధ షష్ఠి తిథి ఆయనను పూజించడానికి సర్వోత్తమమైనది.

ఈరోజున ఆ స్వామిని షోడశోపచారాలతో పూజించినవారికి సంతానప్రాప్తి కలుగుతుందని శాస్త్రోక్తి. కృత్తిక నక్షత్రాన జన్మించినందువల్ల, కార్తికేయుడని, రెల్లుపొదలలో పుట్టినందువల్ల శరవణభవుడని, ఆరుముఖాలుండటం వల్ల షణ్ముఖుడని... ఇంకా స్కందుడని, సేనాని అని, సుబ్రహ్మణ్యేశ్వరుడనే నామాలతో కూడా ప్రసిద్ధుడు. శ్రీవ ల్లి, దేవసేన ఆయన భార్యలు. సుబ్రహ్మణ్యేశ్వరుని వాహనం నెమలి.

ఆరుముఖాలతో, ఎనిమిది భుజాలతో, అపారమైన ఆయుధాలతో దర్శనమిచ్చే కార్తికేయుడు మార్గశిర శుద్ధషష్ఠినాడు మాత్రం సర్పరూపంలో దర్శనమిస్తాడు. ఆ రోజు ఆయనను సర్పరూపునిగా కొలవడం, షోడశోపచారాలతో పూజించి పుట్టలో పాలు పోయడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రతీతి. తమిళనాడు, పళనిలోని సుబ్రహ్మణ్యాలయం, రాష్ట్రంలోని మోపిదేవి, తిరుపతి, స్కందగిరి తదితర ప్రముఖ సుబ్రహ్మణ్య క్షేత్రాలన్నింటిలోనూ స్వామివారికి విశేష పూజలు, ఆరాధనలు జరుగుతాయి.
 

Blogger news

In this blog - [ http://dls-joy.blogspot.in/ ]I am posting various articles related to Education, Science and technology, Wonders etc. In my another blog - [ http://depaspi.blogspot.in/ ]I am posting Annamayya Kritis/Keettannas in Telugu and English Translation.

Blogroll

These are the Blogs which I started as a Hobby: http://dls-joy.blogspot.in/ http://depaspi.blogspot.in/

About

These are the collections of various articles related to Education, Science, Technology, General Knowledge, Wonders etc.,from News Papers, magazines, journals and web services like youtube videos etc.