Pages

Showing posts with label India. Show all posts
Showing posts with label India. Show all posts

What do you know about India

మన దేశం గురించి మీకేం తెలుసు?

మన దేశం గురించి మీకేం తెలుసు?
దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. శుక్రవారం 68వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకొంటున్నాం. అయితే.. అసలు మన దేశం గురించిన విషయాలు మీకు ఎంతవరకు తెలుసు? ఏవేం తెలుసు? ఈ విషయాలు తెలుసుకోవాలంటే ఈ సందర్భంగా ఒక చిన్న పరీక్షపెట్టుకుందామా.. పదండి మరి.

1) జాతీయ పతాకాన్ని రూపొందించింది ఎవరు?

2) మన జాతీయ చిహ్నం ఏమిటి? దాన్ని ఎంపిక చేసింది ఎవరు?

3) మన జాతీయ చిహ్నం మీద ఎన్ని జంతువులు ఉంటాయి?

4) మన జాతీయ నది ఏది? అది ఎప్పటినుంచి అమలులోకి వచ్చింది?

5) భారతదేశం నా మాతృభూమి.. అనే ప్రతిజ్ఞను రాసినవారు ఎవరు?

6) మన జాతీయ మృగం ఏది, జాతీయ నీటి జంతువు, జాతీయ పక్షి ఏవి?

7) మన జాతీయ గేయం ఏది.. జాతీయ గీతం ఏది?

8) మన జాతీయ క్రీడ ఏది?

సమాధానాలు ఇక్కడ చూడండి:
మన దేశం గురించిన ప్రశ్నలకు సమాధానాలు ఇవీ..

1. కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులలో, తెలుపు రంగులో మధ్యగా 24 ఆకుల నీలిరంగు ధర్మచక్రంతో (అశోక చక్రం) భారత జాతీయ పతాకాన్ని రూపొందించుకున్నాం. దీనిని తెలుగువాడైన పింగళి వెంకయ్య రూపొందించారు.

2. బోర్లించినట్టు ఉండే కమలం మీద నిర్మించిన నాలుగు సింహాల శిల్పంలో కింద మకలం భాగాన్ని వదిలేసి, మిగిలిన భాగాన్ని జాతీయ చిహ్నంగా స్వీకరించారు. దాని కింద ‘సత్యమేవ జయతే’ (సత్యమే జయిస్తుంది) అని దేవనాగర లిపిలో రాయించారు. మాధవ్ సాహ్ని దీనిని జాతీయ చిహ్నంగా ఎంపిక చేశారు.

3. మొత్తం నాలుగు రకాల జంతువులు మన జాతీయ చిహ్నం మీద కనిపిస్తాయి. పైన కనిపించే నాలుగు సింహాలు ఆసియాటిక్ లయన్స్. ఈ నాలుగు సింహం తలలు నాలుగు గుణాలకు ప్రతీకలు. అవి- శక్తి, గౌరవం, ధైర్యం, విశ్వాసం. ఇంకా, మన ధర్మచక్రం మీద బలిష్టమైన ఎద్దు, పరుగులు తీస్తున్న గుర్రం, ఏనుగు, సింహం బొమ్మలు ఉంటాయి. ఇవి నాలుగు దిక్కులను చూస్తున్నట్లు ఉంటాయి. జనవరి 26, 1950న దీనిని జాతీయ చిహ్నంగా భారతదేశం అలంకరించుకుంది.

4. మన జాతీయ నది గంగానది. దీన్ని నవంబర్ 5, 2008న జాతీయ నదిగా ప్రకటించారు.

5. ‘భారతదేశము నా మాతృభూమి.. భారతీయులంతా నా సహోదరులు..’ అంటూ సాగే ప్రతిజ్ఞను తొలిసారి 1963లో విశాఖపట్నంలోని ఒక పాఠశాలలో పిల్లల చేత చదివించారు. దీనిని రచించిన వారు పైడిమర్రి వెంకట సుబ్బారావు. నల్లగొండ జిల్లా అన్నేపర్తికి చెందిన వెంకట సుబ్బారావు బహుభాషావేత్త. విశాఖపట్నం ట్రెజరీ అధికారిగా ఉన్నపుడు 1962లో ఈ ప్రతిజ్ఞ తయారుచేశారు. జనవరి 26, 1965 నుంచి దీనిని దేశమంతా చదువుతున్నారు.

6. బెంగాల్ టైగర్ మన జాతీయ మృగం. ఇది శక్తి సామర్థ్యాలకు ప్రతీక. గంగానదిలో కనిపించే మంచినీటి డాల్ఫిన్‌ను జాతీయ నీటి జంతువుగా పేర్కొంటారు. 1963లో నెమలి భారతీయుల జాతీయ పక్షి అయింది.

7. బంకించంద్ర ఛటర్జీ రాసిన వందేమాతరమ్ మన జాతీయ గేయం. ఇది చాలా పెద్దది కావడంతో మొదటి రెండు చరణాలను 1950లో భారత ప్రభుత్వం జాతీయ గేయం (సాంగ్)గా స్వీకరించింది. ఇక సాహిత్య నోబెల్ అందుకున్న ఏకైక భారతీయుడు రవీంద్రనాథ్ టాగూర్ రాసిన గీతం జనగణమన. 1919లో  టాగూర్ తెలుగు ప్రాంతంలోని మదనపల్లెకు (చిత్తూరు జిల్లా) రావడంతో ఆ గీతానికి బాణీ కట్టే సందర్భం వచ్చింది. 52 సెకన్లు పాడుకునే ఈ గీతాన్నే జనవరి 24, 1950లో జాతీయ గీతంగా మన ప్రభుత్వం ప్రకటించింది.  

8. మన జాతీయ క్రీడ.. హాకీ కాదు. అసలు మనకు జాతీయ క్రీడ అంటూ ఏదీ లేదు.

Courtesy: Dr. Goparaju Narayana Rao

టాగ్లు: independence dayour countryquizస్వాతంత్ర్య దినోత్సవంమన దేశంక్విజ్

Guru Poornima - గురుపూర్ణిమ

శరణం... గురు చరణం...

శరణం... గురు చరణం...
గురు బ్రహ్మ

భారతీయ సంప్రదాయంలో గురువుది అత్యున్నతమైన స్థానం. గురువు అనుగ్రహం లేకుండా ఎవ్వరూ జీవిత లక్ష్యాలను సాధించలేరు. తల్లి, తండ్రి, గురువు, అతిథి- ఈ నలుగురు ప్రత్యక్ష గురువులు. భగవంతుని తల్లి, తండ్రి, గురువుల రూపంలోను, తల్లి, తండ్రి, గురువులను భగవంతుని రూపంలోను దర్శించి ఆరాధించడం భారతీయ సంప్రదాయం. సద్గురువును, సదాచార్యుని పొందడం గొప్ప అదృష్టం. యోగ్యత ఉన్న వ్యక్తుల చెంతకు భగవంతుడే ఒక సద్గురువును పంపిస్తాడట. సద్గురువును పొందడానికి యోగ్యత  కలగాలంటే సత్సంగంలోనూ, ఆధ్యాత్మిక కార్యకలాపాలలోనూ పాల్గొనడమే సరైన మార్గం. జగద్గురువు ఆదిశంకరులు, భగవద్రామానుజులు, షిరిడి సాయిబాబా వంటివారు కూడా సద్గురు చరణారవిందాలను సేవించినవారే! ఎందుకంటే...

నీటిలోని చేప తన చూపుతోను, తాబేలు తన స్పర్శతోను తమ పిల్లలని సాకినట్లుగా, శిష్యులను ఉత్తములుగా తీర్చిదిద్దగలిగిన మహనీయులే గురువులు. ప్రపంచంలో ఉన్న అనేక రకాల ఆధ్యాత్మిక సాధనలలో ఏది ఎవరికి తగినది? అన్నదానిని సాధకుని యోగ్యతను బట్టి, అవగాహన స్థాయిని బట్టి నిర్ణయించేది, ఉపదేశించేది గురువే. కనుక మన ధర్మంలో గురువుకు ప్రత్యేక స్థానం ఉండటం వల్ల గురువును దైవంగాను, ఒక్కోసారి దైవం కన్న మిన్నగాను పరిగణించే ఆచారం అనాదిగా వస్తోంది.

అపార జ్ఞానరాశిగా పోగు పడి ఉన్న వేదాలను నాలుగుగా విభజించి, అష్టాదశ పురాణాలను విరచించి, పంచమవేదం వంటి భారత మహేతిహాసాన్ని రచించిన  తేజోమూర్తి వేదవ్యాసుడు. వేదవాఙ్మయానికి మూల పురుషుడయిన వ్యాసుడు జన్మించిన ఆషాఢపూర్ణిమను వ్యాసపూర్ణిమగా జరుపుకుంటున్నాం. అపర నారాయణుడయిన ఈయన వల్లనే మన సంస్కృతి సంప్రదాయాలు ప్రపంచమంతటా పరిఢవిల్లాయి. బ్రహ్మసూత్రాలను నిర్మించి, కర్మ, జ్ఞాన, భక్తి మార్గాలను పటిష్టం చేసిన ఆ వశిష్ఠుని ముని మనుమడయిన వ్యాసుని ఈ రోజు అర్చించడం భారతీయుల కర్తవ్యం.

గురువులలో మొట్టమొదటి వాడు శ్రీకృష్ణుడు. అంతకన్నా ముందు దత్తాత్రేయులవారు. ఆ తర్వాత వేదవ్యాసుడు, ఆయన తర్వాత ఆదిశంకరాచార్యులు, షిరిడి సాయిబాబా, శ్రీ రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, భగవాన్ సత్యసాయి బాబా తదితరులు. వీరెవ్వరితోనూ మనకు ప్రత్యక్షమైన అనుబంధం ఉండచ్చు, ఉండకపోవచ్చు.

అయితే మనకు విద్యాబుద్ధులు నేర్పి, మనం గౌరవప్రదమైన స్థానంలో నిలబడేందుకు బాటలు పరిచిన మన గురువులతో మనకు అనుబంధం, సామీప్యం తప్పనిసరిగా ఉండి ఉంటుంది కాబట్టి గురుపూర్ణిమ  సందర్భంగా వారిని స్మరించుకోవటం, సేవించుకోవటం, సన్మానించుకోవటం సముచితం, సందర్భోచితం.

ఒకవేళ మనకు అందుకు వీలు లేనట్లయితే, కనీసం మన పిల్లలకైనా ఆ అవకాశం కల్పించటం, వారి చేత వారి గురువులకు పాదాభివందనం చేయించటం, సమ్మానింపజేయడం మన కనీస ధర్మం. 

Great Indian Donors

¦µÇª½ÅŒ ŸÄÅŒ©ðx “æX„þÕ°ÂË ÅíL²ÄnÊ¢
’¹ÅäœÄC ª½Ö.8 „ä© Âî{x NªÃ-@ÇL*aÊ N“¤ò ÆCµ¯äÅŒ
«âœî ²ÄnÊ¢©ð “’¹¢C± «ÕLxÂê½ÕbʪëÛ
«á¢¦-ªá: ’¹ÅŒ \œÄC ª½Ö.8 „ä© Âî{x NªÃ-@Ç©Åî N“¤ò ÆCµ¯äÅŒ ư„þÕ “æX„þÕ° ¦µÇª½ÅýÂ¹× Íç¢CÊ ŸÄÅŒ©ðx «á¢Ÿ¿Õ«-ª½Õ-®¾©ð ELÍê½Õ. å£ÇÍý-®Ô‡©ü “’¹ÖXý ͵çjª½t¯þ P„þ ¯ÃœÄªý ª½Ö.3000 Âî{x NªÃ-@Ç©Åî 骢œî ²ÄnÊ¢ ¤ñ¢ŸÄª½Õ. ¨„äÕª½Â¹× Íçj¯ÃÂ¹× Íç¢CÊ '£¾Çª½Õ¯þ J¤òªýd ‰‡¯þ®ÔÑ 2013Â¹× ®¾¢¦¢Cµ¢* ¦µÇª½B§ŒÕ ŸÄÅŒ© N«ªÃ©Õ „ç©x-œË¢*¢C. °‡¢‚ªý «ª½©ÂË~t ¤¶ù¢œä-†¾¯þ æXJ{ °‡¢‚ªý ÆCµ¯äÅŒ “’¹¢C± «ÕLx-ÂÃ-ª½Õb-Ê-ªÃ«Û ª½Ö.740 Âî{x NªÃ-@ÇL*a «âœî ²ÄnÊ¢ ¤ñ¢ŸÄª½Õ. ª½Ö.530 Âî{x ŸÄÅŒ%ÅŒy¢Åî Ê¢Ÿ¿¯þ, ªî£ÏÇF F©ä¹F©Õ ¯Ã©Õ’î ²ÄnÊ¢©ð ELÍê½Õ. Â˪½ºý «ÕW¢ŸÄªý ³Ä (ª½Ö.330 Âî{Õx), ª½ÅŒ¯þ šÇšÇ ª½Ö.310 Âî{Õx NNŸµ¿ 殄à Âê½u-“¹-«Ö-©-Â¹× NªÃ-@ǩՒà ƒ*aÊ{Õx '£¾Çª½Õ¯þÑ ÅçLXÏ¢C. ¨„äÕª½Â¹× ’¹ÅŒ ‚Jn¹ ®¾¢«-ÅŒq-ª½¢©ð ª½Ö.10 Âî{Õx ƢŌ¹¢˜ä ‡Â¹×ˆ«’à NÅŒª½º Íä®ÏÊ 31 «Õ¢C ««ªÃ©ÊÕ èÇGÅéð „ç©x-œË¢*¢C. ¦µÇª½ÅýÂ¹× Íç¢CÊ ŸÄÅŒ©Õ Åí©ÕÅŒ NŸÄuª½¢’¹¢ (ª½Ö.12,200 Âî{Õx), ÅŒªÃyÅŒ ²Ä«Ö>¹ ÆGµ«%Cl´ (ª½Ö.1,210 Âî{Õx), ‚ªî’¹u ª½¢’¹¢ (ª½Ö.1,065 Âî{Õx), “’ÃOÕ-ºÇ-Gµ-«%-Cl´ (ª½Ö.565 Âî{Õx), X¾ªÃu«ª½º X¾Jª½Â¹~º (ª½Ö.170 Âî{Õx), «u«²Ä§ŒÕ ª½¢’ÃEÂË ®¾¢¦¢Cµ¢* ª½Ö.40 Âî{x NªÃ-@Ç©Õ ƒ*aÊ{Õx E„äC¹ „ç©x-œË¢*¢C.

TAgs : Wipro,Ajim Premji,HCL,Siv Nadar,GMR, Grandhi Mallikharjunarao, Nandan, Rohini Nilekhani, Kiran Mazundar Shah,Ratan Tata, HARUN

Indian Space Victories - భారతదేశ అంతరిక్ష విజయాలు

Indian Space Victories - భారతదేశ అంతరిక్ష విజయాలు...

ప్రతి పోటీ పరీక్షలోనూ జనరల్ అవేర్‌నెస్‌లో కీలకమైన విభాగం శాస్త్ర, సాంకేతిక అంశాలు (సైన్స్ అండ్ టెక్నాలజీ). ఈ విభాగంలో ముఖ్యంగా మనదేశం ప్రయోగించిన వివిధ ఉపగ్రహాలు, ఏ సంవత్సరంలో, ఎక్కడి నుంచి ప్రయోగించారు? ఆ ఉపగ్రహాల వల్ల ఉపయోగాలు వంటి అంశాలను అధ్యయనం చేస్తే మంచి మార్కులు సాధించొచ్చు. ఈ నేపథ్యంలో భారతదేశం ప్రయోగించిన వివిధ ఉపగ్రహాల వివరాలు..

ముందుగా ప్రపంచ అంతరిక్ష రంగాన్ని పరిశీలిస్తే.. అమెరికా, సోవియట్ యూనియన్ (ప్రస్తుతం రష్యా) దేశాలు మొదట్లో అంతరిక్ష రంగంలో తీవ్రంగా పోటీపడ్డాయి. ప్రపంచంలో మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహం స్పుత్నిక్-1ను 1957లో అప్పటి సోవియట్ యూనియన్ (యూఎస్‌ఎస్‌ఆర్) ప్రయోగించింది. అదే ఏడాది స్పుత్నిక్-2ను, అందులో లైకా అనే కుక్కను అంతరిక్షంలోకి పంపారు. తద్వారా రోదసీలో ప్రయాణించిన తొలి జంతువుగా లైకా పేరుగాంచింది. 1958లో అమెరికా తన తొలి ఉపగ్రహం ఎక్స్‌ప్లోరర్-1ను ప్రయోగించింది.
 రష్యాకు చెందిన వ్యోమగామి యూరీ గగారిన్ 1961, ఏప్రిల్ 12న వొస్తోక్-1 అనే అంతరిక్ష నౌకలో ప్రయాణించి తొలి అంతరిక్ష యాత్రికుడిగా రికార్డు సృష్టించాడు. మే,  1961లో అలెన్ షెపర్‌‌డకు మొదటి అమెరికా అంతరిక్ష యాత్రికుడిగా గుర్తింపు దక్కింది. అంతరిక్షయానం చేసిన మొదటి మహిళ రష్యాకు చెందిన వాలెంతినా తెరిష్కోవా. ఆమె 1963, జూన్ 16న అంతరిక్షంలోకి ప్రవేశించింది. రష్యాకు చెందిన అలెక్సీ లెనోవ్ అంతరిక్షంలో నడిచిన మొదటి మానవుడు. ఆయన 1965, మార్చి18న ఈ ఘనత సాధించాడు. 1969, జూలై 20న అమెరికాకు చెందిన నీల్ ఆర్‌‌మస్ట్రాంగ్ చంద్రుడిపై అడుగిడిన తొలి వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు. ఆయనతోపాటు ఎడ్విన్ ఆల్డ్రిన్, మైకేల్ కొలిన్స్ కూడా అపోలో-11 నౌకలో ప్రయాణించారు.
1984లో అంతరిక్షయానం చేసిన మొదటి భారతీయుడు రాకేష్ శర్మ. నవంబర్, 1997లో కొలంబియా నౌకలో ప్రయాణించిన కల్పనా చావ్లా మొదటి భారతీయ అంతరిక్ష యాత్రికురాలు. ఆమె 2003, ఫిబ్రవరి 1న కొలంబియా నౌక కూలిపోవడంతో మరణించారు. భారతీయ అమెరికన్ మహిళ సునీతా విలియమ్స్ అంతరిక్షంలో 195 రోజులు గడిపి రికార్డు సృష్టించారు. అంతరిక్షంలో ఎక్కువసేపు నడిచిన (స్పేస్‌వాక్) మహిళ కూడా ఈమే. సునీత 50 గంటల 40 నిమిషాలపాటు అంతరిక్షంలో నడవటంతోపాటు మొత్తం ఏడుసార్లు స్పేస్‌వాక్ చేసింది.

 ఇస్రో:
 భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇండియన్ స్పేస్ రీసెర్‌‌చ ఆర్గనైజేషన్-ఇస్రో)ను 1969లో ఏర్పాటు చేశారు. ఇస్రో ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది. ఇస్రో భారత ప్రభుత్వంలోని అంతరిక్ష విభాగం నియంత్రణలో పనిచేస్తోంది. ఇస్రో ప్రస్తుత చైర్మన్ కె.రాధాకృష్ణన్. అంతరిక్ష పరిశోధనల కోసం ఏర్పాటైన ఇస్రో 1975, ఏప్రిల్ 19న భారతదేశ తొలి ఉపగ్రహం ఆర్యభట్టను సోవియట్ యూనియన్ నుంచి ప్రయోగించింది.
 భారత అంతరిక్ష పరిశోధన పితామహుడు డాక్టర్ విక్రమ్ సారాభాయ్. ఆయన అహ్మదాబాద్‌లో ఫిజికల్ రీసెర్‌‌చ లేబొరేటరీని ఏర్పాటు చేశారు. తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌ను ఆయన పేరు మీదనే నెలకొల్పారు. ఆయన ఇస్రో మొదటి చైర్మన్. ఇప్పటివరకు ఏడుగురు ఇస్రో చైర్మన్‌లుగా బాధ్యతలు నిర్వర్తించారు. వారు.. విక్రమ్ సారాభాయ్, ఎం.జి.కె.మీనన్, సతీశ్ ధావన్, యు.ఆర్.రావు, కె.కస్తూరిరంగన్, జి.మాధవన్ నాయర్, కె.రాధాకృష్ణన్. వీరిలో సతీశ్ ధావన్ అత్యధిక కాలం ఇస్రో చైర్మన్‌గా పనిచేశారు. ఆయన 1972 నుంచి 1984 వరకు 12 ఏళ్లు ఆ పదవిలో ఉన్నారు. 2002లో సతీశ్ ధావన్ మరణానంతరం శ్రీహరికోటలోని ఉపగ్రహ ప్రయోగ కేంద్రానికి సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రంగా నామకరణం చేశారు.

 భారత అంతరిక్ష రంగంలో మైలురాళ్లు

 1962 - భారత జాతీయ అంతరిక్ష పరిశోధనా కమిటీ ఏర్పాటు.
 1965 - తుంబాలో స్పేస్ సైన్‌‌స అండ్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు.
 1969 - ఆగస్ట్ 15న ఇస్రో ఏర్పాటైంది. అప్పుడు అణుశక్తి విభాగం కింద ఉండేది.
 1971 - ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో షార్ కేంద్రం ఏర్పాటైంది.
 1972 - డిపార్‌‌టమెంట్ ఆఫ్ స్పేస్‌ను ఏర్పాటు చేసి ఇస్రోను అంతరిక్ష విభాగం కిందకు తీసుకువచ్చారు. అహ్మదాబాద్‌లో స్పేస్ అప్లికేషన్‌‌స సెంటర్‌ను ఏర్పాటు చేశారు.
 1975 - భారత తొలి ఉపగ్రహం ఆర్యభట్టను ఏప్రిల్ 19న రష్యాలోని బైకనూరు నుంచి ప్రయోగించారు.
 1979 - భాస్కర -1 ఉపగ్రహాన్ని ప్రయోగించారు.
 1980 - శ్రీహరికోట నుంచి శాటిలైట్ లాంచ్ వెహికల్ (ఎస్‌ఎల్‌వీ-3) ద్వారా రోహిణి ఉపగ్రహాన్ని ప్రయోగించారు.
 1981 - జియోస్టేషనరీ కమ్యూనికేషన్ శాటిలైట్ యాపిల్‌ను ఫ్రెంచ్ గయానా నుంచి ప్రయోగించారు. అఞఞ్ఛ అంటే ఏరియన్ ప్యాసింజర్ పేలోడ్ ఎక్స్‌పెరిమెంట్.
 1981 - భాస్కర -2 ప్రయోగం.
 1982 - అమెరికా రాకెట్ ద్వారా ఇన్‌శాట్-1ఏ కమ్యూనికేషన్ శాటిలైట్ ప్రయోగం.
 1983 - ఇన్‌శాట్ -1 బీ ప్రయోగం.
 1984 - రష్యా రాకెట్ సోయూజ్ టీ-11లో రాకేష్‌శర్మ అంతరిక్షయానం.
 1987 - విఫలమైన మొదటి ఎస్‌ఎల్‌వీ ప్రయోగం (ఆగ్‌మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్).
 1988 - రష్యా రాకెట్ ద్వారా తొలి రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ ఐఆర్‌ఎస్-1ఏ ప్రయోగం.
 1991 - ఐఆర్‌ఎస్-1బీ ప్రయోగం.
 1992 - ఇన్‌శాట్ -2ఏ ప్రయోగం.
 1993 - పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్‌ఎల్‌వీ) ద్వారా ఐఆర్‌ఎస్-1ఈ ప్రయోగం. ఇది విఫలమైంది.
 1994 - పీఎస్‌ఎల్‌వీ ద్వారా ఐఆర్‌ఎస్-పీ2ను కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.
 1995 - ఇన్‌శాట్ -2సీ, ఐఆర్‌ఎస్-1సీ ప్రయోగం.
 1996 - పీఎస్‌ఎల్‌వీ -డీ3ని ఉపయోగించి ఐఆర్‌ఎస్-పీ3ను కక్ష్యలో ప్రవేశపెట్టారు.
 1997 - ఐఆర్‌ఎస్-1డీ ప్రయోగం.
 1999 - ఓషన్ శాట్‌తోపాటు విదేశీ శాటిలైట్లను కూడా తొలిసారి ప్రయోగించారు. కొరియా, జర్మనీలకు చెందిన శాటిలైట్లను ప్రయోగించారు.
 2000 - ఇన్‌శాట్-3బీ ప్రయోగం.
 2001- జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్(జిఎస్‌ఎల్‌వీ) రాకెట్ ద్వారా జీశాట్-1 శాటిలైట్‌ను ప్రయోగించారు.
 2002 - వాతావరణ ఉపగ్రహం కల్పన-1ను ప్రయోగించారు. దీని మొదటి పేరు మెట్‌శాట్-1.
 2003 - జీశాట్-2ను, రిసోర్‌‌సశాట్-1ను ప్రయోగించారు.
 2004 - విద్యాసేవలకై ఎడ్యుశాట్ ఉపగ్రహాన్ని ప్రయోగించారు.
 2005 - మ్యాపింగ్ ప్రక్రియలకు ఉద్దేశించిన కార్టోశాట్-1ను, హ్యామ్ రేడియో సేవల కోసం హ్యామ్‌శాట్‌ను పీఎస్‌ఎల్‌వీ-సీ6 ద్వారా ప్రయోగించారు.
 2005 - ఇన్‌శాట్-4ఏ ప్రయోగం.
 2007 - కార్టోశాట్-2, ఇన్‌శాట్-4సీఆర్‌ను ప్రయోగించారు.
 2008 - పీఎస్‌ఎల్‌వీ-సీ10 ద్వారా ఇజ్రాయెల్ శాటిలైట్ టెక్సార్ ప్రయోగం. పీఎస్‌ఎల్‌వీ-సీ9 ద్వారా ఒకేసారి 10 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఇందులో రెండు భారత్‌వి, ఎనిమిది విదేశాలకు చెందినవి.
 2008 - పీఎస్‌ఎల్‌వీ -సీ11 ద్వారా చంద్రయాన్-1ను ప్రయోగించారు.
 2009 - పీఎస్‌ఎల్‌వీ- సీ12 ద్వారా రాడార్ ఇమేజింగ్ శాటిలైట్ (రీశాట్-2), అన్నా యూనివర్సిటీకి చెందిన అనుశాట్‌ను ప్రయోగించారు.
 2010-పీఎస్‌ఎల్‌వీ -సీ15 వాహక నౌక ద్వారా కార్టోశాట్-2బి, స్టడ్‌శాట్‌లతోపాటు మూడు విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించారు.
 2011-పీఎస్‌ఎల్‌వీ-సీ16 ద్వారా రిసోర్‌‌సశాట్-2, యూత్‌శాట్, ఎక్స్‌శాట్ ప్రయోగం. ఇవికాకుండా జీశాట్-12, మేఘ ట్రాపిక్స్ ఉపగ్రహ ప్రయోగాలు.
 2012-ఫ్రెంచ్ శాటిలైట్ స్పాట్-6, జపాన్ శాటిలైట్ ప్రోయిటెరస్ ప్రయోగం. వీటిని పీఎస్‌ఎల్‌వీ-సీ21 రాకెట్ ద్వారా శ్రీహరికోట నుంచి ప్రయోగించారు. ఇది ఇస్రో 100వ అంతరిక్ష ప్రయోగం.
 2013-పీఎస్‌ఎల్‌వీ-సీ20 రాకెట్ ద్వారా సరళ్ అనే భారత్-ఫ్రెంచ్ శాటిలైట్‌ను ప్రయోగించారు. ఇది సముద్రాలను అధ్యయనం చేస్తుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 25న సరళ్‌తోపాటు ఆరు విదేశీ శాటిలైట్లను కూడా ప్రయోగించారు. అవి.. ఆస్ట్రియాకు చెందిన యూనిబ్రైట్, బ్రైట్; డెన్మార్‌‌కకు చెందిన అవ్‌శాట్-3, యూకేకు చెందిన స్ట్రాండ్, కెనడాకు చెందిన నియోశాట్, సాఫైర్.
 2013-పీఎస్‌ఎల్‌వీ-సీ22 ద్వారా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఏ అనే నావిగేషన్ శాటిలైట్‌ను ఈ ఏడాది జూలై1న ప్రయోగించారు.
 2013-ఫ్రెంచ్ గయానాలోని కౌరూ నుంచి ఈ ఏడాది జూలై 26న భారత వాతావరణ ఉపగ్రహం ఇన్‌శాట్-3డీని విజయవంతంగా ప్రయోగించారు.
 2013 - ఈ ఏడాది నవంబర్‌లో మార్‌‌స ఆర్బిటర్ మిషన్‌ను ప్రయోగిస్తారు. ఇది అంగారక గ్రహంపై పరిశోధనలు నిర్వహిస్తుంది.
 చంద్రయాన్: శ్రీహరికోటలోని సతీష్‌ధావన్ స్పేస్ సెంటర్ నుంచి 2008, అక్టోబర్ 22న పీఎస్‌ఎల్‌వీ-సీ11 ద్వారా చంద్రయాన్-1ను ప్రయోగించారు. ఇది 312 రోజులు పనిచేసి 2009, ఆగస్టు 29న ఆగిపోయింది. చంద్రయాన్ చంద్రుడిపై నీటి ఆనవాళ్లను గుర్తించింది. త్వరలో చంద్రయాన్-2ను కూడా ప్రయోగిస్తారు.

 పరిశోధనా సంస్థలు - వాటి విధులు
 1.ఇస్రో - బెంగళూరు
 2.ఫిజికల్ రీసెర్‌‌చ లేబొరేటరీ - అహ్మదాబాద్: ఖగోళ భౌతిక శాస్త్రం, సౌరకుటుంబ భౌతిక శాస్త్రం, ప్లాస్మా భౌతిక శాస్త్రం, పురావస్తు శాస్త్రాల అధ్యయనం.
 3.సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం - శ్రీహరికోట, నెల్లూరు జిల్లా: రాకెట్లు, ఉపగ్రహాలను ప్రయోగించే కేంద్రం.
 4.విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ - తిరువనంతపురం: ఉపగ్రహ వాహక నౌకల తయారీ కేంద్రం.
 5.తుంబా ఈక్వెటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ - తిరువనంతపురం: రాకెట్‌లను ప్రయోగించే ప్రదేశం.
 6.నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ - హైదరాబాద్: దీనిని గతంలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ అని పిలిచేవారు.
 7.మాస్టర్ కంట్రోల్ కేంద్రం - భోపాల్ (మధ్యప్రదేశ్), హసన్ (కర్ణాటక).
 8.ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్‌‌స అండ్ టెక్నాలజీ - తిరువనంతపురం: ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో కోర్సులను నిర్వహిస్తోంది.
 9.ఆంట్రిక్స్ కార్పొరేషన్-బెంగళూరు: ఇది ఇస్రో వాణిజ్య విభాగం. దీన్ని ఉపగ్రహాల సాంకేతిక పరిజ్ఞానం, సేవలను మార్కెట్ చేయడానికి ఏర్పాటు చేశారు.
 ఏపీపీఎస్సీ పరీక్షలలో అడిగిన కొన్ని ప్రశ్నలు
 1.ఏ సంవత్సరంలో ఇండియా తన మొదటి
 ఉపగ్రహం ఆర్యభట్టను ప్రయోగించింది?
 2.కృత్రిమ ఉపగ్రహాన్ని ప్రయోగించిన మొదటి దేశం?
 3.మానవ వ్యోమగామిని చంద్రుడిపైకి పంపిన మొదటి దేశం?
 4.విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం, భారత రాకెట్ లాంచింగ్ కేంద్రం ఉన్న రాష్ర్టం?
 5.సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం ఎక్కడ ఉంది?
 6.చంద్రుడిపై మానవుడు ఎప్పుడు కాలుమోపాడు?
 7.ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్‌‌స అండ్ టెక్నాలజీ ఏ రాష్ర్టంలో ఉంది?
 8.ఇస్రో ప్రస్తుత చైర్మన్?

 సమాధానాలు:
 1. 1975; 2. యూఎస్‌ఎస్‌ఆర్; 3. యూఎస్‌ఏ; 4. కేరళ; 5. శ్రీహరికోట; 6. 1969; 7. కేరళ; 8. కె.రాధాకృష్ణన్
 

Blogger news

In this blog - [ http://dls-joy.blogspot.in/ ]I am posting various articles related to Education, Science and technology, Wonders etc. In my another blog - [ http://depaspi.blogspot.in/ ]I am posting Annamayya Kritis/Keettannas in Telugu and English Translation.

Blogroll

These are the Blogs which I started as a Hobby: http://dls-joy.blogspot.in/ http://depaspi.blogspot.in/

About

These are the collections of various articles related to Education, Science, Technology, General Knowledge, Wonders etc.,from News Papers, magazines, journals and web services like youtube videos etc.